Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తొలిసారిగా తన క్యాంపస్ ఆవల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ నిమిత్తం ఐఎస్బీ సంస్థ తొలిసారిగా 'పీజీపీ ప్రో' ప్రోగ్రామ్ను మొదలు పెట్టింది. త్వరలో పీజీపీ-ఫైనాన్స్ కోర్సును కూడా ముంబయిలో ప్రారంభించనున్నట్టుగా ఐఎస్బీ డీన్ ఫొప్రెసర్ రాజేంద్ర శ్రీవాస్తవ గురువారం తెలిపారు. లండన్ కేంద్రంగా వెలువడే ఫైనాన్షియల్ టైమ్స్లో ప్రపంచంలోని 50 మేటి గ్లోబల్ ఎంబీఏ ఫర్ ఫైనాన్స్ సంస్థల్లో ఐఎస్బీ 44వ ర్యాంకును సాధించినట్టుగా ఐఎస్బీ వెల్లడించింది. బీఎస్ఈలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బీఎస్ఈ ఘంటారావంతో ఈ విషయాన్ని ఐఎస్బీ వెల్లడించింది. గోద్రేజ్ గ్రూపు అధినేత ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు ఆదీ గోద్రేజ్తో కలిసి రాజేంద్ర శ్రీవాస్తవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 'ఫీచర్ ఆఫ్ ఫైనాన్స్ యాజ్ వీ నో ఇట్' పేరున బీఎస్ఈలో చర్చగోష్టిని నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఐఎస్బీ సంస్థ పరిశ్రమ వర్గాల అవసరాల మేరకు ఔత్సాహికులకు శిక్షణనిచ్చి మేటి బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే.