Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రుణ భారంతో దివాలా తీసిని భూషణ్ స్టీల్ సంస్థలో కీలక వాటా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టుగా టాటా స్టీల్ సంస్థ వెల్లడించింది. తమ అనుబంధ కంపెనీ బామ్మీపాల్ స్టీల్ లిమిటెడ్ సంస్థ భూషణ్ స్టీల్లో 72.65 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిందని టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ప్రాకారం ఈ వాటా విక్రయం పూర్తయిందని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా భారతీయ రిజర్వు బ్యాంక్ గుర్తించిన ఒత్తిడిలో ఉన్న 12 సంస్థలు, ఆస్తుల జాబితాలో భూషణ్ స్టీల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. సంస్థ రుణ భారాన్ని తీరుస్తూ.. తిరిగి పట్టాలెక్కించే క్రమంలో భాగంగా ఆర్బీఐ ఈ సంస్థను ఎన్సీఎల్టీకు అప్పగించిన సంగతి తెలిసిందే.