Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మార్చితో ముగిసిన త్రైమాసికానికి బంపర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో సంస్థ లాభం 36 శాతం మేర పెరిగి రూ.862.25 కోట్ల నుంచి రూ.1,175.47 కోట్లకు చేరుకున్నట్టుగా సంస్థ వెల్లడించింది. మార్చి త్రైమాసికంలో బజాజ్ ఆటో అమ్మకాల్లో 33 శాతం వృద్ధి నమోదు అయింది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ 7.87 లక్షల వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి సంస్థ మొత్తంగా 10.45 లక్షల వాహనాలను అమ్మినట్టుగా సంస్థ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ అమ్మకాలు 9 శాతం పెరిగి 36.66 లక్షల నుంచి 40.06 లక్షలకు చేరినట్టుగా బజాజ్ వెల్లడించింది. మార్చి త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం 21 శాతం పెరిగి రూ.5,212 కోట్ల నుంచి రూ.6,330 కోట్లకు చేరుకుంది.