Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిఘమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మార్కెట్లోకి అద్భుత ఆఫర్ను తీసుకువచ్చింది. ప్రైవేట్ టెల్కోలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు షాక్నిస్తూ తాజాగా 'డేటా సునామి' ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 98 రూపాయలకే రోజుకు 1.5 జీబీ డేటాను 26 రోజుల పాటు ఆఫర్ చేయనున్నట్టుగా బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఈ కొత్త ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎస్ఎన్ఎల్ సర్కిళ్లలో వెంటనే అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ప్యాక్ను 118 రూపాయల రీఛార్జ్ ప్యాక్ లాంచ్ చేసిన మరుసటి రోజే మార్కెట్లోకి తీసుకురావడం విశేషం. బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన 118 రూపాయల రీఛార్జ్ ప్యాక్పై అపరిమిత వాయిస్ కాల్స్, 28 రోజుల పాటు 1 జీబీ డేటా అందుబాటులో ఉండనుంది.