Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వర్చువల్ మనీ(క్రిప్టో కరెన్సీ)ని నిషేధిస్తూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలపై దాఖలైన అన్ని పిటిషన్లనూ ఒకే చోట విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కేంద్ర బ్యాంకు ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు, కోల్కతా హైకోర్టులో ఒకటి, సుప్రీం కోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అన్ని వ్యాజ్యాలను సుప్రీం వేదికగా విచారించాలని పెద్దకోర్టు నిర్ణయించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ జూలై 20కు వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది. క్రిప్టో కరెన్సీకి మద్దతునివ్వడం, ఈ కరెన్సీతో ఇతర వ్యాపార లావాదేవీలేవీ జరపవద్దని బ్యాంకులు, ఈ వ్యాలెట్ సంస్థలు, పేమెంట్ గేట్వే ప్రొవైడర్లను ఆదేశిస్తూ...ఏప్రిల్ 6న ఆర్బీఐ సర్క్యూలర్ జారీచేసింది. ఫైనాన్షియల్ సంస్థలు జూలై 5కల్లా క్రిప్టో కరెన్సీసేవలను నిలిపివేయాలని, బ్యాంకులు జూలై 6లోపు ఈ సేవలను ఆపివేయాలని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.