Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అమర రాజా బ్యాటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక పలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ రూ.109.80 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.99.19 కోట్లుగా ఉంది. మార్చి త్రైమాసికానికి అమర రాజా బ్యాటరీస్ రూ.1,604.44 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.1,526.99 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన మొత్తం ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.6,299.35 కోట్లుగా నమోదు అయింది.. ఇందులో సంస్థ లాభం రూ.471.32 కోట్లుగా నిలిచింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం రూ.478.49 కోట్లు కాగా.. ఆదాయం రూ.6,030.63 కోట్లకు చేరువైంది. అమెరికాలోని మిల్వేకీలో సమావేశమైన కంపెనీ బోర్డు రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.15ల తుది డివిడెండ్ను చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. కంపెనీ ఆర్థిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఎండీ జయదేవ్ గల్లా మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో గత ఏడాది విక్రయాలు పెరగడంతో పాటు బ్యాటరీ రిప్లేస్మెంట్ లావాదేవీలు పెరగడం సంస్థ మెరుగైన లాభాలను ఆర్జించేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు.