Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయ్ మాల్యా బాటలో నీరవ్ అడుగులు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్కు పాల్పండి దేశం దాటేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్లో తలదాచుకుంటున్నట్టుగా సమాచారం. భారత్లో ఆర్థిక మోసాలకు పాల్పడిన వారికి బ్రిటన్లోని చట్టాల నుంచి తగిన రక్షణ లభిస్తుందన్న విషయం కింగ్ ఫిషర్ విజరు మాల్యా కేసులో నిరూపితం కావడతం తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసాగాడు నీరవ్ మోడీ కూడా నెమ్మదిగా థేన్స్ తీర పట్టణానికి చేరుకున్నట్టుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. స్కామ్ బట్టబయలైయ్యే ముందు భారత్ నుంచి అమెరికా చెక్కెసిన నీరవ్ మోడీ అక్కడి నుండి సింగపూర్ పాస్పోర్ట్పై లండన్ వెళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాల ద్వారా తెలుస్తోంది. పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి చాలా రోజుల ముందే నీరవ్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం భారత్కు రావాలని ఈడీ అధికారులు ఇప్పటికే అనేకసార్లు సమన్లు జారీ చేసినా ఫలితం లేకుండాపోయింది.