Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ సరికొత్త మిడ్సైజ్ సెడాన్ 'టయోటా యారిస్' వాహనాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది. యారిస్ ప్రారంభ ధర రూ. 8.75 లక్షలుగా (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ) గా కంపెనీ నిర్ణయించింది. కస్టమర్లకు ఆకట్టుకునేలా టయోటా యారిస్ ఫ్రంట్ డిజైన్ను చాలా అట్రాక్టివ్గా కంపెనీ రూపొందించింది. ఫ్రంట్ డిజైన్లో బంపర్పై బిగ్ ఫ్రంట్ గ్రిల్, పగటిపూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న స్లీక్ హెడ్ల్యాంప్ డిజైన్, టయోటా లోగోకు ఇరువైపులా క్రోమ్ స్లాట్, బంపర్కు ఇరువైపులా కర్వీ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ ఈ వాహనానికి అదనపు హంగులు. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ రెండువెర్షన్లలోనూ ఇవి లబించనున్నాయి. టయోటా యారిస్ 1.5-లీటర్ డ్యూయల్ వీవీటీ-ఐ పెట్రోల్ ఇంజీన్తో రూపొందించారు. ఇది గరిష్టంగా 108 బీహెచ్పీ పవర్, 140ఎన్ఎమ్ టార్క్తో శక్తిని విడుదల చేస్తుంది. యారిస్ అన్ని వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో ఈ వాహనం లభించనుంది. కాగా యారిస్ పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ మోడల్ మైలేజ్ లీటరుకు 17.8 కిలోమీటర్లు, మ్యాన్యువల్ వేరియంట్ 17.1కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.