Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం విషయంలో ఆ బ్యాంక్ అధికారుల పాత్రను స్పష్టం చేస్తూ సీబీఐ చార్జ్షీట్ను రూపొందించింది. పీఎన్బీ స్కామ్ విషయం ఆ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్కు ముందే తెలుసునని సీబీఐ తన చార్జ్షీట్లో అభిప్రాయపడింది. ఆమె మరికొంత మంది బ్యాంక్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆర్బీఐను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ మేరకు కోర్టులో 12,000 పేజీల చార్జ్షీట్ను దాఖలు చేసింది. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం నీరవ్ మెదీ, నిషాల్, నీరవ్ గ్రూప్కు చెందిన సుభాష్ పరబ్లపై నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఉషా అనంత సుబ్రమణియన్తో సహా పలువురు బ్యాంక్ కీలక అధికారులకు దుబాయి బ్రాంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో జరుగుతున్న మోసం ముందే తెలుసినా ఉషా అర్ధవంతమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది.