Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశ్రామిక వర్గాల ఆందోళన
న్యూఢిల్లీ: చమురు ధరలు అంతకంతకు పెరుగుతుండడం పట్ల పారిశ్రామిక వార్గలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పెరగుదల ఇలాగే కొనసాగితే రాన్ను రోజుల్లో దేశ ఆర్థిక వృద్ధి ప్రమాదంలో పడే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ధరల పెంపునకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే ఆటోమొబైల్ ఇంధనాలను జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) పరిధిలోకి తీసుకురావాలని వారు సూచిస్తున్నారు. దేశంలో చమురు ధరల పెరుగుదలను నియంత్రించేందుకు గాను చర్యలు చేపట్టాలని ఫిక్కీ, అసోచామ్ డిమాండ్ చేస్తున్నాయి. తక్షణం చమురు దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని సూచిస్తున్నాయి. దీంతో పాటు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలంటే పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పారిశ్రామిక వర్గాలు సూచిస్తున్నాయి.