Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందారు మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్) కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. తమ అన్ని మోడళ్ల ధరలపై 2శాతం వరకు పెంచుతున్నట్లు సంస్థ వెల్లడించింది. పెంచిన ధరలు జూన్ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన ఎస్యూవీ క్రెటా ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని హెచ్ఎంఐఎల్ స్పష్టం చేసింది. హ్యుందారు కంపెనీకి చెందిన కార్లు ప్రస్తుతం రూ.3.3 లక్షల నుంచి రూ.25.44 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. తాజాగా అన్ని కార్లపై ఆయా మోడళ్లను బట్టీ 2 శాతం వరకు ధరలను పెంచినట్లు సంస్థ ప్రకటించింది. 'తయారీ ఖర్చులు, ముడి వస్తువుల ధరలు పెరగడం, దిగుమతి చేసుకునే విడి భాగాలపై సుంకాన్ని పెంచడం తదితర కారణాల వల్ల కార్ల ధరలను పెంచుతున్నాం' అని హ్యుందారు వెల్లడించింది.