Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పిల్లలకు సంపూర్ణ ఎదుగుదలకు అవసరమై పోషకాలతో కూడిన పిడియా ష్యూర్ హెల్త్ డ్రింక్ను ఎబోట్ ఫార్మా సంస్థ సరికొత్త ఫ్లేవర్లో మార్కెట్లోకి విడుదల చేసింది. కుకీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ రూపంలో దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. చిన్నారుల అభిరుచులకు తగ్గట్టుగా తమ సంస్థ మార్కెట్లోకి ఈ కొత్త పీడియా ష్యూర్ను మార్కెట్లోకి ఆవిష్కరించినట్టుగా సంస్థ అధినేత, జనరల్ మేనేజర్ అమల్ కేల్శికర్ తెలిపారు. ఈ కొత్త పీడియాషూర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నటి లారాదత్త పాల్గొన్నారు. పిడియాష్యూర్ డ్రింక్ ప్రపంచ వ్యాప్తంగా పిల్లల డాక్టర్లు సిఫారసు చేస్తున్న హల్డ్రింక్ అని అమల్ తెలిపారు. ప్రస్తుత వేసవి కాలంలో పిల్లలు తిండిపై ఆసక్తి తగ్గించి.. ఆటపాటలపై అమితాసక్తి చూపుతారని ఈ సమయంలో వారికి కావాల్సిన సత్తాను అందించేందుకు గాను కొత్త ఫ్లేవర్లో పిడియాష్యూర్ను అందుబాటులోకి తెచ్చినట్టుగా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రోజుకు రెండు పూటల ఈ హెల్త్ డ్రింక్ను పిల్లలకు అందించడం వల్ల వారిలో ఉన్న పోషకాహర లోపం సరిదిద్దబడుతుందని.. పిల్లలు సంపూర్ణ ఎదుగుదలకు తమ ఉత్పాదన ఉపయోగపడుతుందని అబోట్ ఇండియా సంస్థ వివరించింది.