Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కిశోర్ బియానికి చెందిన ఫీచర్ గ్రూపు నుంచి భారతీ గ్రూపు పూర్తిగా వైదొలిగింది. భారతీ గ్రూపునకు చెందిన అనుబంధ సంస్థ సెడార్ సపోర్ట్ సర్వీసెస్, ఫీచర్ గ్రూపులో ఉన్న 13.64 శాతం మొత్తం వాటాను దాదాపు రూ.240 కోట్లకు విక్రయించింది. ఫీచర్లో భారతీ అనుబంధ సంస్థకు ఉన్న 61,919,69 షేర్లను సగటున ఒక్కో షేరును రూ.39.21లకు విక్రయించింది. బ్లాక్ డీల్, ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటా విక్రయం జరిగినట్టుగా ఫీచర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రెగ్యూలేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ షేర్లును చేజ్కించుకున్న వారిలో ఫీచర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రమోటర్లు సెంట్రల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్, బెన్నెట్, కోలమెన్ అండ్ కంపెనీలు ఉన్నాయి. 2015లో ఫీచర్ గ్రూపు ఈజీడే బ్రాండ్తో ఉన్న చైన్ మార్కెట్ను భారతీ గ్రూపు దాదాపు రూ.750 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. దీంతో ఆ సంస్థ దేశంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్గా ఆవిష్కరించింది. ఆ తరవాత ఇప్పుడు రెండు సంస్థలు విడిపోవడం విశేషం.