Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తరువాత మరోమారు మదుపరులకు ఆనందాన్ని పంచాయి. గురువారం కొనుగోళ్ల జోరుతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా మెరిశాయి. ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తరువాత కొంత మందగించినప్పటికీ కొనుగోళ్ల జోరుతో మిడ్సెషన్ నుంచి జోరందుకున్నాయి. సెషన్ చివర్లో ఇన్వెస్టర్లు మరింతగా కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ 395 పాయింట్ల మేర ఎగిసింది. చివరికి స్వల్ప లాభాల స్వీకరణతో త్రిపుల్ సెంచరీకి పైన 318 పాయింట్ల లాభంలో 34,663 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే 83 పాయింట్ల లాభంతో 10,514 వద్ద స్థిరపడింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్ల జోరుతో మార్కెట్లు ఈ మేర ఎగిసినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మాలు లాభాలు పండించగా.. ఆటో షేర్లు మాత్రంకాస్త నిరాశపరిచాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ 4 శాతం వరకు లాభాలు పండించగా.. టాటా మోటార్స్, గెయిల్, ఓఎన్జీసీ 4 శాతం నుంచి 7 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ మాత్రం 70 పాయింట్లు క్షీణించింది.