Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) భారీ కుంభ కోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన తొలి చార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం తన తొలి చార్జిషీటును దాఖలు చేయడం విశేషం. నీరవ్ మోడీ, ఆయన సన్నిహితులపై తాము తొలి చార్జిషీటు దాఖలు చేస్తున్నామని ఈడీ అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మనీ 'లాండరింగ్ నిరోధక చట్టం'లోని పలు సెక్షన్ల కింద దాదాపు 12వేల పేజీల చార్జిషీటును రూపొందించి దానిని స్పెషల్ కోర్టు ముందుకు తీసుకొచ్చినట్టు తెలిపారు. నీరవ్ మోడీ మేనమామ మెహుల్ చౌక్సి, ఆయన వ్యాపారాలకు వ్యతిరేకంగా కూడా ఏజెన్సీ రెండో చార్జిషీటు దాఖలు చేయనున్నట్టుగా సమాచారం. ఈ చార్జిషీటులో కేసు ప్రారంభమైనప్పటి నుంచి మోడీకి, ఆయన అసోసియేట్స్కు వ్యతిరేకంగా జరిపిన ఆకస్మిక సోదాలు, దాడులు వాటిల్లో చేసిన అన్ని అటాచ్మెంట్ల వివరాలను ఇందులో పేర్కొంది. ఈ నెల మొదట్లో సీబీఐ సైతం పీఎన్బీ కుంభకోణ కేసులో రెండు చార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ, మెహుల్ చోక్సీలు కలిసి దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా పీఎన్బీలో కుంభకోణానికి పాల్పడినట్టుగా విచారణలో తెలింది. కొందరు బ్యాంకు ఉద్యోగుల సాయంతో వీరు ఈ కుంభకోణం చేశారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. పీఎన్బీ ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే వారు దేశం విడిచి పారిపోయారు. ఇటు విచారణకు సైతం సహకరించడం లేదు ఈ నేపథ్యంలో ఈడీ చార్జ్షీట్తో విచారణం వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ చార్జ్షీట్ ఆదారంగా పీఎన్బీ విదేశాల్లోనూ నీరవ్పై సూట్ వేసేందుకు వీలు పడనుంది.