Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలకు ప్రభుత్వం గురువారం నాన్ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్స్ను నియమించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శ తపన్రే ను సెంట్రల్ బ్యాంక్కు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ చరన్ సింగ్ను పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్నుకు, టీపీజీ ప్రయివేట్ ఈక్విటీ మాజీ గ్లోబల్ పార్ట్నర్ అంజలీ బన్సాల్ను దేనా బ్యాంక్కు చైర్పర్సన్గా నియమిస్తూ ఆర్థిక సేవల శాఖ గురువారం ఉత్తర్వూలను వెలువరించింది. ఈ సందర్భంగా ఆ శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా పునర్నియమితమైన 'బ్యాంక్స్ బోర్డు బ్యూరో' (బీబీబీ) సిఫారసుల మేరకే తాము కొత్త చైర్పర్సెన్స్ నియామకాలను చేపట్టినట్టుగా తెలిపారు. డీవోపీటీ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మ నేతృత్వంలోని బ్యాంకింగ్ సంస్కరణలో భాగంగానే బీబీబీ సిఫారసుల మేరకు బ్యాంకింగ్ సంస్కరణలు చేపట్టినట్టుగా ఆయన వివరించారు.