Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంకు మార్చితో ముగిసిన ఆర్థిక త్రైమాసికానికి భారీ నష్టాలను నమోదు చేసింది. మార్చి31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ రూ. 5,662.76కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోని ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ. 3,199.77 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2018లో జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ బ్యాంకు ఆదాయం రూ.7,913.82కోట్లుగా ఉంది. గతేడాది కంటే ఆదాయం స్వల్పంగా పెరిగింది. 2016-17 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 7,702.9 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇదే సమయంలో బ్యాంక్ నిరర్ధక ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగింది. 2017 ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో రూ.6,054.39 కోట్లుగా ఉన్న ఎన్పీఏ విలువ.. ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి రూ.10,773.30 కోట్లకు చేరాయి. ఇక మొండి బాకీల విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది.