Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ల మధ్య నెలకొన్న డేటా టారీఫ్ పోటీ రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా జియోను రూ.299లతో రీచార్జీ చేసుకునే వారికి 28 రోజుల పాటు 4.5జీబీ డేటా అందించనున్నట్లు జియో ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.299కు 28 రోజుల పాటు 84జీబీ డేటాను అందిస్తోన్న ఈ కంపెనీ.. ఇప్పుడు దాని పరిమితిని 126 జీబీలకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆఫర్ జూన్30, 2018 వరకే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ మొత్తానికి రోజుకు 3జీబీ డేటాను కంపెనీ అందిస్తూ వస్తోంది. ఈ ఆఫర్తో పరిమితి కాస్తా రోజుకు 4.5జీబీకి పెరిగినట్టయింది. రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్రిపెయిడ్ ప్లాన్ల కింద రోజూవారీగా వినియోగదారులు 3జీబీ డేటా అందిస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు మైజియో ఆప్ ద్వారా ఈ రీచార్జీలు చేసుకుంటే రూ.300 కంటే ఎక్కువ రీచార్జీ మీద రూ.100, అంతకంటే తక్కువ రీచార్జీ మీద 20శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.