Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిట్ఫండ్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కీలక మైలురాయిని చేరుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్ల టర్నోవర్కు చేరుకున్నట్లు సంస్థ ఎండీ చెరుకూరి శైలజాకిరణ్ ప్రకటించారు. 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మార్గదర్శి సంస్ధ.. దేశవ్యాప్తంగా సుమారు 50లక్షల మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. 2025 నాటికి సంస్థ టర్నోవర్ రూ.20వేల కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది కొత్తగా 5-6 బ్రాంచులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం చిట్ఫండ్పై 12శాతం జీఎస్టీ ఉందని.. దీనిని తొలగిస్తే వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు.