Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీరామ్కు ఐడీబీఐ అధినేత బాధ్యతలను అదనంగా అప్పగించ నున్నారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం.కె.జైన్ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా ఎంపికైన నేపథ్యంలో శ్రీరామ్కు ఆయన బాధ్యతలను అప్పగించాలని ఆర్థికశాఖ వర్గాలు నిర్ణయించినట్టుగా సమాచారం. శ్రీరామ్కు తన బాధ్యతలను అప్పగించిన తరువాత ఎం.కె.జైన్ శుక్రవారం నుంచి ఆర్బీఐలో కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెల్లడి కానుంది.