Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సౌకర్యాలతో కూడిన కార్యస్థలాన్ని అందించే స్మార్ట్వర్క్స్ సంస్థ హైదరాబాద్లో బుధవారం కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. సుమారు 86000 చ.అడుగుల విస్తీర్ణంలో దాదాపు 1700 మంది ఒకే చోట కూర్చొని పని చేసుకొనే విధంగా సంస్థ దీనిని రూపొందించింది. 2016లో ప్రారంభమైన తమ సంస్థ మొత్తం పది లక్షల చదరపు అడుగుల వర్క్స్పేస్తో.. ఇప్పటి వరకు 15 కేంద్రాలను నిర్వహిస్తున్నట్టుగా సంస్థ నీతిష్ సర్దా తెలిపారు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఈ కేంద్రంలో దాదాపు 75 శాతం ముందస్తు బుకింగ్లు పూర్తయినట్టుగా ఆయన వివరించారు. రానున్న ఏడాది కాలంలో మరింతగా విస్తరించాలని తాము నిర్ణయించామన్నారు. తన విస్తృతిని 50 లక్షల చదరపు అడుగులకు విస్తరించనున్నట్టుగా ఆయన వివరించారు. ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా తమ కార్యకాలాపాలను విస్తరించనున్నట్టుగా సర్దా వివరించారు.