Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)అరవింద్ సుబ్రమణియన్ (59) తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అరవింద్ తన కుటుంబంతో కలిసి ఉండేందుకు.. అక్కడ తాను నిర్వర్తించాల్సిన బాధ్యతల నేపథ్యంలో ఆయన తిరిగి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో అరవింద్ సుబ్రమణియన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో దానిని ఆమోదించడం మినహా తనకు మరో మార్గం లేకుండా పోయిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. 'పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్' విద్యాసంస్థలో సినియర్ఫెలోగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న వేళ సుబ్రమణియన్ అక్టోబరు 2014న ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసే అవకాశం లభించింది. తన తొలి విడుత పదవీ కాలం ముగింపులోనూ అరవింద్ తనను బాధ్యతలను నుంచి తప్పించాలని వేడుకున్నట్టుగా జైట్లీ తెలిపారు. అయితే తన బలవంతం మేరకు ఆయన ఇప్పటివరకు ప్రభుత్వానికి సేవలందిస్తూ వచ్చారని తెలిపారు. వాస్తవానికి సుబ్రమణియన్ పదవీ కాలం 2019లో ముగియాల్సి ఉంది.