Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: తమ సర్కారు చేపడుతున్న సంస్కరణలు, అమలులోకి తెస్తున్న కొత్త పన్నుల విధానాలతో దేశంలో సంపద పంపిణీ జరుగుతోందని గొప్పలు చెబుతున్న కేంద్రం మాటల్లో నిజం లేదని తేలిపోయింది. గత ఏడాది దేశంలో నోట్ల రద్దు అనంతర ప్రతికూల పరిస్థితులు, వస్తుసేవల పన్ను (జిఎస్టి) అమలు వల్ల ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ డాలర్ మిలియనీర్ల (10 లక్షల డాలర్ల సంపద) సంఖ్య 20.4 శాతం మేర పెరిగి 2.63 లక్షలకు చేరుకుందని ఫ్రెంచ్ టెక్నాలజీ సంస్థ క్యాప్జెమినీ నివేదిక వెల్లడించింది. అధిక విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ)గా కూడా పరిగణించే ఈ సంపన్నుల ఉమ్మడి సంపద గత ఏడాదిలో 21% మేర పెరిగి లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరిందని ఆ సంస్థ పేర్కొంది. హెచ్ఎన్ఐల సంఖ్య విషయంలోనే కాకుండా సంపద విషయంలో కూడా భారత్ ప్రపంచ సగటుకన్నా (వరుసగా 11.2 శాతం, 12 శాతం) మెరుగ్గా ఉండటం విశేషం. అమెరికా, జపాన్, జర్మనీ, చైనా దేశాల్లో అత్యధికంగా హెచ్ఎన్ఐలు ఉన్నట్టు క్యాప్జెమినీ నివేదిక పేర్కొంది. హెచ్ఎన్ఐల సంఖ్య వేగవంతంగా పెరుగుతున్న ఫలితంగా హెచ్ఎన్ఐలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచిందని తెలిపింది. గత ఏడాదిలో స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50 శాతానికి పైగా పెరగడం, రియల్టీ ధరల్లో 4.8 శాతం సగటు వృద్ధి, జీడీపీలో 6.7 శాతం పెరుగుదల నేపథ్యంలో భారత్లో హెచ్ఎన్ఐల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడింది.కోటీశ్వరుల సంఖ్య విషయానికొస్తే భారత్కు అంతర్జాతీయంగా 11వ స్థానానికి పెరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ, చైనాలు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. స్టాక్ మార్కెట్లలో నమోదిత కంపెనీల మొత్తం విలువ గతేడాది 50 శాతానికి పైగా పెరగడం, భారత జీడీపీ 6.7 శాతం వృద్ధి సాధించడం.. భారత్లో కోటీశ్వరుల సంఖ్య పెరగడానికి దోహదం చేసినట్టుగా క్యాప్ జెమినీ విశ్లేషించింది.