Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రైల్వే కన్సల్టెన్సీ సంస్థ ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు మదుపరుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐపీవో రెండో రోజు ముగింపు నాటికే పూర్తి సబ్స్క్రిప్షన్ లభించింది. గురువారం మధ్యాహ్నం నాటికి 150% సబ్స్క్రైబ్ అయినట్లు.. ఎన్ఎస్ఈలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తెలుస్తోంది. రిటైల్ విభాగం తొలిరోజే 164% సబ్స్క్రైబ్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకు తొలి ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐటీఈఎస్. రేపటితో ఈ ఐపీవో ముగియనుంది. ఈ ఐపీవోకు ధరల శ్రేణి రూ.180-185గా నిర్ణయించారు.