Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గురువారం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పబ్లిక్ ఇష్యూతో సహా మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), ఎఫ్పీఐ, నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ముంబయిలో సమావేశమైన సెబీ బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా సెబీ చైర్మెన్ అజరు త్యాగి వెల్లడించారు. ఐపీవోలో ధరల శ్రేణిని (ప్రైస్బ్యాండ్) నిర్ణయించే సమయాన్ని ప్రస్తుతం ఉన్న అయదు నుంచి రెండు రోజులకు తగ్గించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు బైబ్యాక్ , ఎఫ్పీఐ, మ్యూచివల్ ఫండ్స్ నిబంధనలు కూడా సవరి స్తున్నట్టుగా త్యాగి పేర్కొన్నారు. ''కొత్త నిబంధనల ప్రకారం బోర్డు తీర్మా నానికి, వాటాదారులకు చెల్లింపులు చేసిన తేదీకి మధ్య కాలాన్ని బైబ్యాక్ పీరియడ్గా భావిస్తారు. దీంతో పాటు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టి ట్యూషన్స్ల్లో(ఎంఐఐ) 15శాతం వరకు విదేశీ సంస్థల వాటా ఉండవ చ్చు.. వీటితోపాటు టేకోవర్ నిబంధనల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. వీటికి బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలిపారు.