Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు తదుపరి చైర్మెన్గా ఎం.డి.మాల్యా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డులో ఎం.డి.మాల్యా స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో మాల్యా బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మెన్గా పనిచేశారు. ఈ నెల మొదటి వారంలో సమావేశమైన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు తదుపరి చైర్మెన్గా మాల్యా పేరును ఖరారు చేసి ఆర్బీఐ అనుమతుల కోసం పంపినట్లు సమాచారం. ప్రస్తుత ఛైర్మన్ ఎం.కె.శర్మ పదవీకాలం జూన్30వ తేదీతో ముగియనుంది. ఆయన స్థానంలో మాల్యాను నియమించేందుకు బోర్డులో మెజార్టీ సభ్యులు మాల్యాకు అనుకూలంగా ఉన్నారని.. తమ నియమక నిర్ణయానికి సమ్మతి తెలపాల్సిందిగా కోరుతూ బ్యాంకు బోర్డు ఆర్బీఐకి వర్తమానం పంపినట్టు అయితే ఆర్బీఐ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని బ్యాంకు అధికారు ఒకరు తెలిపారు. సాధారణంగా ఇటువంటి అంశాల్లో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డుతోనే ఆర్బీఐ కూడా ఏకీభవిస్తుంది. కానీ, ఆర్బీఐ నిర్ణయంలో జాప్యానికి కారణం తెలియరావడం లేదని ఆయన వెల్లడించారు.