Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో అంతరా ్జతీయ యోగాడే వేడుకలు ఘనంగా జరిగాయి. కోఠి లోని బ్యాంక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ హైదరాబాద్ జోనల్ ఏజీఎం ఎల్.ఎం.బాలీ, హైదరాబాద్ రీజినల్ కార్యాలయపు డీఆర్ఎం ఎ.కె.థోమర్లు ప్రారంభించారు. శ్రీపరివార్కు చెందిన సుబ్రహ్మణ్యం, రవీంద్రలు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు, ఖాతాదారులకు యోగా ప్రాధాన్యతను గురించి వివరించారు. యోగా ద్వారా తనువును, ఆత్మను ఎలా ఆరోగ్యంగా.. ప్రశాంతంగా.. ఉంచుకోవచ్చన దానిపై వారు పలు సలహాలను అందజేశారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాజేంద్ర వర్మ, సీనియర్ మేనేజర్ వరప్రసాద్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగాడే వేడుకల్లో పాల్గొనేందుకు గాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన వివిధ శాఖల సిబ్బందితో పాటు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవ తీసుకొని యోగాడే వేడుకలను నిర్వహించడాన్ని పలువురు ప్రశంసించారు.