Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టాల్లో ప్రారంభమై.. లాభాల్లో ముగింపు
- 257 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం మెరుగైన లాభాలను నమోదు చేశాయి. ఒపెక్ దేశాల సమావేశం ఫలప్రదం కావడం, అంతర్జాతీయంగా అందిన సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వాణిజ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశీయ సూచీలు ఉదయం డీలా పడినప్పటికీ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాయి. ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం నుంచి లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్ ఆరంభంలో 23.01 పాయింట్లు పడిపోయి 35,409.38 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 13పాయింట్ల నష్టంతో 10728 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఫార్మా రంగాల షేర్ల మద్దతుతో చివరి గంటలో మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ఒపెక్ సమావేశం నేపథ్యంలో చమురు సరఫరాను రోజుకు ఒక మిలియన్ బారెల్(1 ఎంబీపీడీ) పెంపునకు ప్రతిపాదనలు చేసినట్లు సౌదీ అరేబియా చమురు మంత్రి ఖలీద్ అల్-ఫలీV్ా వెల్లడించారు.ఈ ప్రతిపాదనకు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచేందుకు ఇరాన్ తొలత అంగీకరించనప్పటికీ చివరి క్షణంలో మనసు మార్చుకుందన్న వార్తలు మార్కెట్కు ఉత్తేజాన్ని ఇచ్చాయి. దీంతో చమురు ధరలు దిగిరానున్నాయన్న వార్తలు మార్కెట్లకు జోష్నిచ్చాయి. ఫలితంగా మధ్యాహ్నం నుంచి మార్కెట్లు లాభాల బాట పట్టి వారాంతంలో మేటి లాభాలను నమోదు చేశాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 257.21 లాభంతో 35,689.60 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 80.80 పాయింట్ల లాభంతో 10,821.90 పాయింట్లకు చేరింది. సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ, తదితర కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్పీసీఎల్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, యూపీఎల్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.79వద్ద ట్రేడయింది. రూపాయి డాలరుతో పోలిస్తే 18 పైసలు పెరిగి 67.80గా నమోదైంది. ఎగుమతిదారులు, బ్యాంక్లు అమెరికా కరెన్సీని ఎక్కువగా అమ్మడంతో, రూపాయి బలపడింది.