Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఈ-కామర్స్ మార్కెట్లోకి అరంగేట్రం చేసేం దుకు సన్నాహాలు చేసుకుంటోంది. తన ఈ నూతన ప్రస్థానాన్ని గూగుల్ భారత్ నుంచే మొదలు పెట్టాలని భావిస్తోన్నట్టు సమాచారం. రిటైల్ దిగ్గజం వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లో కీలక వాటా కొనుగోలు చేసి భారత్లో దూసుకుపోయే యత్నాల్లో ఉన్న నేపథ్యంలో గూగుల్ ఈ దిశగా కొత్త అడుగులు వేయడం విశేషం. ప్రస్తుతం సొంతంగానే గ్లోబల్ ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించాలని గూగుల్ భావిస్తోంది. 2020 నాటికి దేశీయ ఈ-కామర్స్ మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకోబోతున్న నేపథ్యంలో భారతీయ ఈ-కామర్స్తో అరంగేట్రం చేయడం మేలని ఆ సంస్థ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ వారం ప్రారంభంలోనే ఈ-కామర్స్ మార్కెట్పై తనకు ఆసక్తి ఉందని గూగుల్ సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే చైనీస్ ఈకామర్స్ కంపెనీ జేడీ.కామ్లో గూగుల్ 550 మిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లలోకి వెళ్లే ముందు, భారత్లో వీటిని టెస్ట్ చేయాలనుకుంటోందని సమాచారం. దీని కోసం 2వేల వర్క్షాపులను నిర్వహించింది. గూగుల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కోసం 15 వేల మందికి పైగా విక్రయదారులను గుర్తించిందని కూడా తెలిసింది. వచే దీపావళి నుంచి సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఈ సంస్థ భావిస్తున్నట్టుగా సమాచారం.