Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లోకి టీయూవీ300 ప్లస్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మహీంద్రా అండ్ మహీంద్రా కొత్తతరం మినీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎంఎస్యూవీ) మార్కెట్లోకి తీసుకు వచ్చింది. 'టీయూవీ-300 ప్లస్' పేరుతో తొమ్మిది సీట్ల సామర్థ్యం గల కొత్త వాహనాన్ని సంస్థ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.9.47 లక్షలుగా (ఎక్స్షోరూం, ముంబయి) నిర్ణయించింది. 2.2 లీటరు ఎంహెచ్ఏడబ్ల్యూకేడీ 120 సామర్థ్యంతో కూడి ఎంహాక్ ఇంజిన్తో పాటు హై-టెక్ ఫీచర్లతో కొత్త వాహనం అందుబాటులోకి వచ్చింది. 17.8 సెంటీమీటర్ల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, జీపీఎస్ నావిగేషన్, 4 స్పీకర్లు, 2 ట్యూటర్లు, ఈసీఓ మోడ్, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, బ్లూసెన్స్ యాప్, ఈసీఓ మోడ్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ టెక్నాలజీ, ఇంటెలిపార్క్ రివర్స్ అసిస్ట్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ వాహనం అదనపు ప్రత్యేకతలు. కొత్త వాహనం 4400ఎంఎం పొడవు, 1835 ఎంఎం వెడల్పు, 1812 ఎంఎం ఎత్తును ఇది కలిగి ఉంటుంది. అయిదు రంగుల్లో ఇది మార్కెట్లోకి లభించనుంది. పీ4, పీ6, పీ8 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. 2015 సెప్టెంబర్ నుంచి టీయూవీ300 విజయవంతంగా రోడ్లపై నడుస్తుందని, ఇప్పటి వరకు ఆన్ రోడ్డుపై 80వేల వాహనాలను విక్రయించినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్, మార్కెటింగ్ చీఫ్ విజరు రామ్ నోక్రా చెప్పారు. ఎక్కువ స్పేస్, ఎక్కువ పవర్తో టీయూవీ300 ప్లస్ను ప్రవేశపెట్టినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఆకర్షణీయమైన సులభ నెలవారీ వాయిదాల్లో కూడా ఈ వాహనం మార్కెట్లో లభించనున్నట్టుగా కంపెనీ వర్గాలు తెలిపాయి.