Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థలో సుస్థిరతకు పలు చర్యలు చేపట్టాం..
- బోర్డు, మేనేజ్మెంట్ కలిసి పని చేస్తున్నాయి
- భవిష్యత్తులో మెరుగైన వృద్ధి దిశగా చర్యలు: 37వ ఏజీఎంలో చైర్మెన్ నందన్ నీలేకని
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మనుగడపై ముసురుకున్న నీలి మేఘాలను దూరం చేసే ప్రయత్నం చేశారు ఆ సంస్థ చైర్మెన్ నందన్ నీలేకని. ఇన్ఫోసిస్ సుస్థిరంగా ఉందని తిరిగి వేగంగా వృద్ధి రేటును అందుకోవడం సిద్ధంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ 37వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్ఫోసిస్లో సుస్థిరతను సాధించేందుకుగాను పలుచర్యలు చేపట్టినట్టుగా వివరించారు. తాను గత ఆగస్టు మాసంలో రెండోమారు ఇన్ఫోసిస్లో అడుగు పెట్టినప్పుడు ఇన్ఫోసిస్ సుస్థిరతపై పలు అనుమానాలు వెలువెత్తాయని.. అయితే సంస్థలో సాధారణ పరిస్థితులను తీసుకు వచ్చేందుకు గాను పలు చర్యలు చేపట్టినట్టుగా ఆయన వివరించారు. సంస్థలో పరిస్థితలు కుదురుకున్నాయని ఆయన తెలిపారు. ఇన్ఫోసిస్లో ప్రస్తుతం సుస్థిరమైన బోర్డు, మేనేజ్మెంట్ ఉందని.. అందరూ కలిసి పని చేస్తున్నారి నీలేకని వివరించారు. గత ఏడాది సంస్థ వ్యవస్థాపకులకు, కొందరు బోర్డు సభ్యులకు, విశాల్ సిక్కాకు మధ్య మనస్పర్తల నేపథ్యంలో కంపెనీలో గందరగోళ పరిస్థితుల ఏర్పడి వృద్ధి రేటు 5.8 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. సంక్లిష్ట సమయంలో కంపెనీ బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు సాగిన నీలేకని ఇప్పుడు ఇన్ఫోసిస్ సుస్థిరత స్థాయికి చేరుకుందని ప్రకటించడం అటు మదుపరులను, ఇటు మార్కెట్ వర్గాలను కంపెనీ ఉద్యోగులకు ఊరటనిచ్చింది. కొత్త సీఈవో సలీల్ పారేఖ్ నేతృత్వంలో ఇన్ఫోసిస్ అంతర్గతంగా తనను తాము సమీక్షించుకుంటూ భవిష్యత్తులో వృద్ధికి గత మార్గాలను అన్వేషించుకుంటూ ముందుకు సాగుతోందని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో సంస్థ విషమ పరిస్థితులను ఎదుర్కొంటూ తనను ముందుకు సాగి మెరుగైన ఆర్థిక పనితీరును కనబరిచిందని ఆయన వివరించారు.
సంస్థలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తారు..
ఇన్ఫోసిస్ సంస్థకు ఉద్యోగులై బలమని సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ అన్నారు. సంస్థలో పని చేయడాన్ని వారు గౌరవంగా భావిస్తూ ఉంటారని వివరించారు. భవిష్యత్తు వృద్ధి కోసం తాము నాలుగు స్తంభాల వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టుగా వివరించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవడానికి గాను తాము మూడేండ్ల కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టుగా పరేఖ్ వివరించారు. డిజిటల్ గ్రోత్ నిమిత్తం సంస్థ ఘణనీయంగా పెట్టుబడులు పెడుతూ వస్తోందని ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్రావు తెలిపారు.