Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ విద్యుత్ ఉపకరణాల సంస్థ జీబ్రానిక్స్ ఎస్ఎ ల్యు 3 అనే పేరుతో సరికొత్త ఐదు పోర్టుల డాకింగ్ హబ్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకేసారి 5 పరికారలను చార్జ్ చేసుకోవచ్చు. దీనికుండే ఫాస్ట్ చార్జ్ ఫీచర్ ద్వారా మొబైల్ ఫోన్లతో పాటు విద్యుత్ పరికరాలను త్వరగా చార్జ్ చేసుకోవచ్చునని జీబ్రానిక్స్ డైరెక్టర్ ప్రదీప్ జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి పుట్టగొడుగు (మష్రూమ్) ఆకారంలో ఉండే ఎల్ఈడీ లైంట్ కూడా ఉండటం వల్ల ఇది నైట్ల్యాంప్గా కూడా ఉపయోగపడుతుందని వెల్లడించారు. గరిష్ట ఔట్పుట్ 6 ఏ వాట్స్ సామర్థ్యంతో ఇది పనిచేస్తుందని తెలియజేశారు. ఇది డాక్ 4 పోర్టుల మొడల్ కూడా లభ్యమవుతోందని.. దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ స్టోర్లలో ఇవి లభిస్తాయని ఆయన తెలిపారు.