Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: సానుకూల పవనాల నేపథ్యంలో దలాల్స్ట్రీట్ కళకళలాడింది. చమురు ధరలు తగ్గు ముఖం పట్టడం వంటి అంతర్జాతీయ సంకేతాలతో పాటు దేశీయ పరిణామాలపై సానుకూలతల నేపథ్యంలో మదుపర్లు స్టాక్ మార్కెట్లలో తాజా కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో గురువారం ఆరంభం నుంచే జోరుమీదున్న సూచీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్ 282 పాయింట్లు ఎగబాకి 36,548 పాయింట్ల వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు నిఫ్టీ కూడా 75 పాయింట్ల లాభంతో 11,023 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 68.59గా కొనసాగుతోంది. బ్యాంకింగ్, రిలయన్స్ షేర్ల దన్నుతో గురువారం మార్కెట్లు 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను మొదలై దూకుడును కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు దూసుకెళ్లాయి. ఇటీవల జరిగిన ఏజీఎం సమావేశంలో నేపథ్యంలో షేరు ధర 52 వారాల గరిష్ఠానికి పెరిగింది.