Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నోయిడాలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు నుంచి మరో రెండు నెలల్లో తరువాత ఉత్పత్తి ప్రారంభం కానుందని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ 'ఇంటెక్స్' మొబైల్ విభాగం అధినేత ఇషిత భన్సాల్ తెలిపారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో సాగుతున్న ప్లాంట్లను కొత్త ఈ యూనిట్లోకి మార్చనున్నామని తెలిపారు. గురువారం రెండు కొత్త స్మార్ట్ఫోన్లను ఆమె మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇన్ఫీ 33, ఇన్ఫీ 3 స్మార్ట్ఫోన్ల ధరలను వరుసగా రూ.5,049, రూ.4,649గా నిర్ణయించామన్నారు. వరుసగా 3000 ఎంఎహెచ్, 2000 ఎంఎహెచ్ బ్యాటరీలతో వీటిని అందిస్తున్నామని తెలిపారు. కొత్త యూనిట్ను 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ దశల్లో అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్కు రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు. ప్రస్తుతం జమ్మూ, బడ్డిలోని నిర్వహిస్తన్న ప్లాంట్లను కూడా కొత్త యూనిట్లోకి మార్చనున్నామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెవెన్యూలో 15 శాతం వృద్ధి అంచనా వేస్తున్నామన్నారు. 2017-18లో రూ.3,200 కోట్ల టర్నోవర్ సాధించామన్నారు. దేశంలో ప్రతీ రెండు సెకన్లకు ఒక ఇంటెక్స్ ఉత్పత్తి విక్రయం అవుతోందన్నారు.