Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ సూచీలు వారాంతంలో స్వల్ప నష్టాల మధ్య ముగిశాయి. శుక్రవారం ఉదయం జీవితకాల గరిష్టం నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించిన మార్కెట్లు ఉదయం తొలి ట్రేడింగ్ వేళల్లో లాభాల్లోనే కొనసాగాయి. అనుకూలతల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్ వంద పాయింట్ల లాభంలో కదలాడాయి. నిఫ్టీ కూడా ఉదయం 11వేల మ్యాజిక్ మార్కు పైనే ట్రేడయ్యింది. తర్వాత కూడా లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరకు స్వల్పం మొత్తంలో నష్టాలను మూట గట్టుకున్నాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 6.78 పాయింట్ల నష్టంతో 36541.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 4.30 పాయింట్ల నష్టంతో 11018.90 పాయింట్లకు స్థిరపడింది.