Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పెరుగుతున్న చమురు ధరలు, క్షీణిస్తున్న రూపాయి విలువ నేపథ్యంలో భారత వాణిజ్య లోటు అంతకంతకు పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశ వాణిజ్య లోటు జూన్ మాసంలో అయిదేండ్ల గరిష్టానికి చేరింది. ఏడాది ప్రాతిపదికన జూన్ మాసంలో ఎగుమతులు 17.57 శాతం పెరిగినప్పటికీ.. దేశ వాణిజ్య లోటు 16.6 శాతానికి ఎగిసింది. అంతకు ముందు మే మాసంలో ఈ లోటు 14.62 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే కాలంలో దేశ చమురు దిగుమతులు 56.61 శాతం పెరిగి 12.73 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచలో భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం అయినందునే ముడి చమురు ధరల్లో పెరుగుదల ఆ దేశంపై బాగా ప్రభావితం చేస్తున్నట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు తాజాగా డాలరుతో పోటీ పడలేక రూపాయి రోజురోజుకు క్షీణిస్తుండడం కూడా దేశ వాణిజ్యంపై ప్రభావం కనబరుస్తోంది. దిగుమతులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించింది.