Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది గ్రేట్ బ్రిటన్ను దాటేసి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంచనా వేస్తున్న వృద్ధిరేటుతో భవిష్యత్తులో కూడా దూసుకుపోతే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించడం సాధ్యమేనని ఆయన అన్నారు. అయితే అంతకంతకు పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం వంటివి మాత్రం ఇందుకు ప్రతిబంధకాలుగా నిలిచే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రస్తుతం మనం అంచనా వేస్తున్న వృద్ధి రేటుతో ఎదిగితే వచ్చే ఏడాది గ్రేట్ బ్రిటన్ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం' అని పేర్కొన్నారు. ఫేస్బుక్లో జైట్లీ 'గ్రామీణ భారతానికి కాంగ్రెస్ నినాదాలు ఇచ్చింది- ప్రధాని మోదీ వనరులు ఇచ్చారు' పేరుతో ఒక ఆసక్తికరమైన పోస్టు చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మనం తర్వాతి దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థ మేటి విస్తరణను చూడొచ్చన్నారు.