Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిలయన్స్ సంస్థల షేర్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ అధినేత మఖేష్ అంబానీ ఆసియాలో అతిపెద్ద సంపన్నుడిగా మారిపోయారు. ఆసియాలో ఇప్పటి వరకు అపర కుబేరుడిగా ఉన్న ఆలీబాబా గ్రూపు వ్యవస్థాపకుడు జక్మాను దాటేస్తూ ఆయన ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. శుక్రవారం రిలయన్స్ సంస్థ షేర్లు మరో 1.7 శాతం అధికంగా మర్కెట్లో ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముకేష్ అంబానీ సంపద దాదాపు 44.3 బిలియన్ డాలర్లకు చేరువైనట్టుగా బ్లూమ్బర్గ్ సూచీ తెలిపింది. ఇదే సమయంలో అలీబాబా షేర్లు లాభాలతో పాటు తగ్గుతుండడం ఆయన సంపద దాదాపు 44 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ ఆసియాలోనే అపర కుబేరుడి హోదాను సొంతం చేసుకున్నారని బ్లూమ్బర్గ్ విశ్లేషణ వర్గాలు తెలిపాయి. జామ్నగర్ శుద్ధి కేంద్ర సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు జియో వంటి పలు విప్లవాత్మకమైన వ్యాపార కార్యకలాపాలకు ముకేష్కు బాగా కలిసి వస్తున్నాయని.. దీనికి తోడు త్వరలో అంబానీ అందుబాటులోకి తేనున్న జియో బ్రాడ్బ్యాండ్, రిలియన్స్ రిటైల్ విస్తరణతో ఆయన ఆసియా అపర కుబేరుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.