Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ మీడియాటైన్మెంట్ సంస్థ రీసెర్చ్ మీడియా గ్రూపుతో ఇంటీరియర్ డిజైన్స్ సంస్థ కీహైట్స్ జట్టు కట్టింది. శనివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఇరు సంస్థలు పరస్పర వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సందర్బంగా రీసెర్చ్ మీడియా గ్రూపు చైర్మెన్ జె.చైతన్య, సీఈవో సీిహెచ్ హరిలీలా ప్రసాద్ మాట్లాడుతూ ఇంటీరియర్ డిజైనింగ్లో 15 సంవత్సరాల అనుభవం కలిగిన కీహైట్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా వుందన్నారు. రీసెర్చ్ మీడియా బహుముఖంగా విస్తరిస్తోందని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వ్యాపార ఒప్పందం ప్రతిపాదికగా కీహైట్స్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, అర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ డిజైనింగ్ సేవలలో రీసెర్చ్ మీడియాకు తోడ్పాటును అందిస్తుందన్నారు. కీహైట్స్ ఇన్ఫ్రా వ్యవస్థాపకులు, చైైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు 250 వరకు ప్రాజెక్టులకు శాస్త్రీయ, ఇంటీరియర్ సేవలు అందించనట్లుగా వెల్లడించారు. తిరుపతి మైథలాజికల్ పార్కు డిజైన్కు సహకరించామని వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో ఒక్క హైదరాబాద్లోనే రూ.6వేల కోట్ల వరకు ఇంటీరియర్ మార్కెట్ అవకాశాలు చోటు చేసుకోనున్నాయని పేర్కొన్నారు. తాము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ముఖ్య నగరాల్లో సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మ్యాజిక్ మంత్ర క్రియేటివ్ హెడ్ లోహిత్ కుమార్, నటుడు సాల్మన్ షానీ తదితరులు పాల్గొన్నారు.