Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ లిస్టెడ్ కంపెనీల ఆర్ధిక ఫలితాల ఆడిట్, థర్డ్పార్టీ నియామ కాలపై నిబంధనలను కఠనత రం చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతిపాదనలరను రూపొందిస్తోంది. ఈ నిబంధనల తయారీ కోసం కోటక్ కమిటీ సెబీకి కొన్ని సిఫార్సులు చేసినట్లు సమాచారం. కొత్త నిబంధనలను అందుబాటులోకి వస్తే తప్పుడు నివేదికలు ఇచ్చే ఆడిటర్లు, థర్డ్పార్టీ వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సెబీకి అధికారులు దక్కనున్నాయి. ఆడిటర్లు కంపెనీ ఆడిట్ కమిటీకి రాతపూర్వకంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలపై సెబీ అభిప్రాయసేకరణ ప్రారంభించింది. మరో 30 రోజుల్లో ఈ అభిప్రాయసేకరణ ముగుస్తుంది. ప్రస్తుతం మర్చెంట్ బ్యాంకర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కస్టోడియన్స్ తదితర సంస్థలు సెబీ వద్ద రిజిస్టర్ చేయించుకోవాల్సి వుంటుంది. కాగా ఆడిటర్లు, కంపెనీ సెక్రటరీలు, ఆర్ధిక అంశాల విలువ కట్టేవారు నేరుగా సెబీ పరిధిలోకి రారు. కంపెనీకి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు నివేదికలు ఇచ్చే వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం కంపెనీ బోర్డ్ఆఫ్ డైరెక్టర్స్కు ఉండాలనేది సెబీ ప్రతిపాదనల్లో ఒక్కటి. పైగా కంపెనీలకు సంబంధించి ఆడిటర్లు తాము ఇచ్చిన నివేదకలోని అన్ని అంశాలు పూర్తి స్థాయిలో పరిశీలించి ఇచ్చినవే అని హామీ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల పైగా మోసం వెలుగు చూసిన నేపథంయలో ఆడిటింగ్పై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.