Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమిళనాడు కేంద్రంగా దక్షిణాదిన సేవలందిస్తున్న ది చెన్నై సిల్క్ సంస్థ రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బహుముఖంగా విస్తరించాలని యోచిస్తున్నట్టుగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత్ వెల్లడించారు. త్వరలో కంపెనీ ఎఫ్ఎంసీజీ రంగంలోకి అడుగుపెట్టనుందని ఆయన సూచన ప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తమ సంస్థకు 25 స్టోర్స్ ఉన్నట్టుగా ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు హైదరాబాద్లో రెండు చిత్తూరులో ఒక స్టోర్ ఉందని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో వీటిని మరింతగా విస్తరించనున్నట్టుగా ఆయన తెలిపారు. తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా కూకట్పల్లి స్టోర్లో కొత్తగా అందుబాటులోకి తేనున్న గృహోపకరణాల విభాగాన్ని ఆదివారం సూపర్స్టార్ మహేష్ బాబు ప్రారంభించనున్నారని ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 6-7 వేల కోట్ల మధ్య టర్నోవర్ను సాధించామన్నారు.