Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2030నాటికి రూ.10 లక్షల కోట్లకు జీడీపీ
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గార్గ్ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకొనే దశలో ఉందని.. 2030 నాటికి ఇది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2030 నాటికి దేశ జీడీపీ 10 ట్రిలియన్ల స్థాయికి చేరుకుంటుందని ఆయన అంచనా కట్టారు. ఆర్థిక వ్యవస్థలో పలు పెరుగైన చర్యలు చేపట్టడం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి 40 ఏండ్ల కాలంలో భారత్ గరిష్టంగా 3.5 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిందని.. ప్రస్తుతం 7-8 శాతం వృద్ధి అనేది సాధారణంగా మారిందని అన్నారు. 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా' ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆర్థిక వ్యవస్థ పురోగతి నుంచి పలు విషయాలను వెల్లడించారు. 2030 నాటికి మన ఆర్థిక వ్యవస్థ పది లక్షల కోట్ల స్థాయిని అందుకోగలదనిఅన్నారు. ఇది ఒక సవాలు అని.. అదే కాలంలో ఇది ఒక అవకాశం కూడా అనియ ఆయన వ్యాఖ్యానించారు. 8 శాతం వృద్ధి సాధించదగినదేనని ఆయన అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థను 10 ట్రిలియన్ల స్థాయిని చేర్చే దిశగా ముందుకు సాగాల్సి ఉందని అన్నారు. దీంతో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు. 2017లో భారత్ మెరుగైన జీడీపీతో ఫ్రాన్స్ను వెనక్కి నెట్టుతూ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో గార్గ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2022 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని.. 2030 నాటికి ఇది దాదాపు మొత్తం ఆర్థిక వ్యవస్థలో సగానికి చేరువకానుందని ఆయన తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులు పెరగనప్పటికీ ప్రభుత్వంమే తన పెట్టుబడులను పెంచుతుండడంతో మార్చితో ముగిసిన త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ ఏడు త్రైమాసికాల గరిష్టంగా 7.7 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.