Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాణిజ్య విభాగం
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్టాప్సీ) 2016-17కు గాను ఎక్సలెన్సీ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్టాప్సీ ప్రెసిడెంట్, గౌర శ్రీనివాస్, ఎక్సలెన్సీ అవార్డ్సు కమిటీ ఛైర్మన్ అనీల్ రెడ్డి వెన్నెమ్ మాట్లాడుతూ ఆగస్టు 18వ తేది వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. 21 కేటగిరీల్లో అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. అక్టోబర్, నవంబర్లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందన్నారు. గతేడాది 103 దరఖాస్తులు వచ్చాయని, ఈ ఏడాది పెరుగొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.