Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్లలో సందడి చేశాయి. 5 శాతానికి పైగా ర్యాలీ జరిపి ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన తన తొలి త్రైమాసిక ఫలితాల్లో 1:1 బోనస్లు జారీ చేయడంతో ఆ కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లలో నమోదై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాటాదార్లకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మరో బోనస్ షేరు (1:1 నిష్పత్తి)ను ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం ఉదయం ఇన్ఫోసిస్ షేరు ధర 52 వారాల గరిష్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.3 లక్షల కోట్లను చేరింది. బీఎస్ఈ ఇంట్రాడేలో ఇన్ఫోసిస్ షేరు ధర 5.75శాతం పెరిగి రూ.1384.4 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని చేరుకున్న సమయంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ మేర పెరిగింది. ఇక ఎన్ఎస్ఈలో ఆ కంపెనీ షేర్ ధర 5శాతం పెరిగి ఏడాది గరిషా'నికి చేరింది. ఆ అనంతరం చివరికి 1.41 శాతం లాభంలో రూ.1,336 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్లో ఇన్ఫోసిస్ అతిపెద్ద గెయినర్గా నిలిచింది. మొత్తం 1.29 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడయ్యాయి.