Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను కుదించింది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతున్నప్పటికీ.. చమురు ధరల సెగ, పటిష్టమైన ఆర్థిక విధానాల కారణం ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతానికే పరిమితం కావొచ్చని అంచనా కట్టింది. అంతకు ముందు ఐఎంఎఫ్ భారత్ 7.4 శాతం వృద్ధిని సాధించగలదని లెక్క గట్టింది. ఈ రెండు అవరోధాల కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.8 శాతం నుంచి 7.5 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా సోమవారం ఐఎంఎఫ్ తాజాగా వెల్లడించిన 'వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్'లో తెలిపింది. పెరుగుతున్న చమురు ధరల ధర దేశీయ డిమాండ్ను ప్రభావితం చేస్తుండడం.. దేశంలో ఆర్థిక వ్యవస్థను ఊహించదానికంటే వేగంగా కఠినతరం చేస్తుండడం కారణంగా భారత వృద్ధి రేటు తగ్గిపోయే అవకాశం ఉన్నట్టుగా ఐఎంఎఫ్ తెలిపింది.