Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాణిజ్య విభాగం
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 1150 గ్రామీణ, పట్టణ శాఖలలో కిసాన్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. రైతు ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి బుధవారం (18న) ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటుగా వారి హక్కులు, బ్యాంకు చేపట్టిన పలు కార్యక్రమాల గురించి అవగాహన కల్పించనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని 1.5 కోట్ల మంది రైతులు తమ ఖాతాదారులుగా ఉన్నారని పేర్కొంది. జాతీయ స్థాయిలో 14వేల శాఖల్లో జరిగే ఈ కిసాన్మేళా ద్వారా కనీసం 10 లక్షల మంది రైతులను చేరుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఎస్బీఐ ఇటీవలనే దేశ వ్యాప్తంగా పలు చోట్ల కిసాన్మేళాలను నిర్వహించి 6 లక్షల మందికి పైగా రైతులను కొత్తగా చేరువైంది.