Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్లో కీలక వాటా కొనుగోలుకు గాను బీమా రంగపు దిగ్గజం భారతీయ బీమా సంస్థకు (ఎల్ఐసీ) మార్గం మరింత సుగమమైంది. సోమవారం ఎల్ఐసీ బోర్డు సమావేశమై ఐడీబీఐలో కీలక వాటా కొనుగోలు అంశానికి అధికారికంతగా పచ్చజెండా ఊపింది. ఐబీబీఐ బ్యాంక్లో తమ వాటాను 51 శాతానికి పెంచాలని బోర్డు నిర్ణయించిందని ఎల్ఐసీ బోర్డు సభ్యుడు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వెల్లడించారు. ఈ వాటాల కొనుగోలు వ్యవహారం ప్రిఫరెన్షియల్ షేర్స్ బదిలీ రూపంలో ఉండే అవకాశం ఉందని గార్గ్ చెప్పారు. ఒక వేళ అవసరమైతే ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్పటికే ఈ డీల్కు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఐ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐడీబీఐలో ఎల్ఐసీకి 10.82శాతం వాటా ఉంది. ప్రభుత్వానికి 80.96 శాతం వాటా ఉంది. అయితే ఇప్పుడు ఎల్ఐసీ ఆఫర్పై ఐడీబీఐ బ్యాంక్ బోర్డూ, ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. గత మార్చి త్రైమాసికం నాటికి ఐడీబీఐ బ్యాంక్కు రూ.55,600 కోట్ల మేరకు మొండి బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే ఈ డీల్పై ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంక్ల ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.