Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆయుర్వేద, దేశీయోత్పత్తులతో తన కంటూ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పతంజలి సంస్థ త్వరలో పండ్లు, కూరగాయలను కూడా విపణిలోకి తీసుకురానుంది. ఇప్పటికే శీతలీకరించిన బఠాణీలను పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా విక్రయిస్తున్న పతంజలి త్వరలో క్యారెట్, కాలీఫ్లవర్ ప్రయోగాత్మకంగా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో కొన్ని కూరగాయలను మాత్రమే మార్కెట్లోకి తెచ్చి.. తర్వాత దశలో ఆరేడు రకాల కూరగాయలను తీసుకురావాలన్నది కంపెనీ వ్యూహంగా పలు మీడియా సంస్థల్లో వర్తాలు విశదీకరిస్తున్నాయి. శీతలీకరించిన కూరగాయలు, ఖాదీ ఉత్పత్తులను తీసుకు వచ్చేందుకు గాను సంస్థ దాదాపు రూ.10,000 కోట్లను వ్యయం చేయనున్నట్టుగా సమాచారం. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కంపెనీ యూనిట్ల నుంచి ఆయా కూరగాయలను సేకరించాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం 2019 నాటికి 10వేల రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం శీతలీకరించిన పండ్లు, కూరగాయల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ.1500 కోట్ల వరకు జరుగుతోందని, భవిష్యత్లో ఇది మరింతగా విస్తరించే అవకాశముంద నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పతంజలి గ్రూపు ఈ దిశగా దృష్టి సారిస్తోందని వారంటున్నారు.