Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఫోర్డ్ ఇండియా సరికొత్త రికార్డుకు చేరువైంది. 1998లో భారత్లో ఫోర్డ్ ఇండియా పేరుతో అడుగు పెట్టిన ఫోర్డ్ సంస్థ దేశంలో తాజాగా పది లక్షల వాహనాల అమ్మకాలను చేరుకుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మోహ్రోత్రా ఫోర్డ్ మిలియన్ వాహనాన్ని డెలివరీ చేశారు. న్యూఢిల్లీకి చెందిన నిఖిల్ కక్కుర్కు ఫోర్డ్ ఫ్రీస్ట్రైల్ను అందించడం ద్వారా తాము మిలియన్ అమ్మకాల మార్క్ను చేరుకున్నట్టుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోర్డ్ సంస్థ తనదైన రీతిలో మెరుగైన వాహనాలను వినియోగదారులకు అందిస్తూ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది.