Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ/హైదరాబాద్: టెలికాం రంగంలో పోటీ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వినియోగదారులకు అతి త్వరలో 5జీ సేవలను అందుబాటులోకి తేనుంది. బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) అనీల్ జైన్ ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. భారత్లోని మిగతా టెలికాం సంస్థల కంటే ముందుగా తామే 5జీ సేవలను అందించడానికి కసరత్తు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సేవలు జూన్ 2020 నాటికి ప్రారంభ కావొచ్చని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోందని.. అయితే 2019 నాటికే ఈ సేవలు ప్రారంభమయ్యే వీలుందని జైన్ పేర్కొన్నారు. కాగా అందరికంటే ముందుగానే తాము 4జీ సేవలను ప్రారంభించే అవకాశాన్ని కోల్పోయామన్నారు. ఇప్పుడు 5జీ సేవల విషయంలో అద్భుత అవకాశాన్ని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. కాగా 5జీ సేవలను పరిశీలించేందుకు నోకియా, ఎన్టీటీ అడ్వాన్స్ టెక్నాలజీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్టుగా ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా జైన్ కొత్త ప్లాన్లను ప్రకటించారు. ఆ వివరాలు.. బీబీజీ యుఎట్డి ప్లాన్లో భాగంగా రూ.99, రూ.199, రూ.299, రూ.491 రీచార్జిపై 6 నెలల గడువుతో ఏ నెట్వర్క్కైనా ఉచితంగా 24 గంటలు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టుగా వివరించారు. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రయివేటు టెల్కోలకు దీటుగా బ్రాడ్బ్యాండ్లో భారీ డేటాతో ముందుకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో రిలయన్స్ జియో బ్రాడ్బాండ్లోకి రానున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ముందు జాగ్రత్తగా పెద్ద మొత్తంలో డాటా వినియోగించే వారి కోసం అత్యంత ఆకర్షణీయ ప్లాన్ను ఆవిష్కరించింది. అయితే దీన్ని చెన్నరు సర్కిల్కు మాత్రమే పరిమితం చేసింది.